దువ్వూరులో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి
దువ్వూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా దువ్వూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి, ఆయన సేవలను స్మరించుకున్నారు. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన కృషిని నాయకులు గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: