40సంవత్సరాల రాజకీయ అనుభం… 14 సంవత్సరాలు వివిధ మంత్రిత్వ శాఖల్లో పదవులను చేపట్టిన సీనియర్ నాయకుడని చెప్పుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ తాను స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేస్తానంటు స్టేట్మెంట్లు ఇస్తున్నారని, ఎన్నికల్లో బీజేపీలో పొత్తులు వెట్టుకున్న వీరు ఎందుకు బీజేపీ కండువాలు వేసుకొని రాజకీయం చేయడంలేదో ప్రజలకు సూటిగా సమాధానం చెప్పాలని నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి రెడ్డి ప్రశ్నించారు. ఈనెల 28వ తేది నంద్యాలలో జరిగిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో మేఘంతా సిద్ధం భారీ బహిరంగ సభ సక్సస్ కాపడంలో జీర్ణించుకోలేని ఫరూక్ తాజాగా మీడియా సమావేశంలో శిల్పా కుటుంబంపై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అసత్యపు వాఖ్యలు చేయడంపై శనివారం మీడియా సమావేశం నిర్వహించి శిల్పా రవిరెడ్డి తన దైన శైలిలో స్పందించారు.నంద్యాలలో జరిగిన సభలో జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు తాను అధికారంలో ఉన్న కాలంలో చేసిన అభివృద్ధి గురించి చెప్పాడని, జగన్ మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారన్నారు. ఫరూక్ నంద్యాలలో తన విలువైన స్థలాలను ప్రజల సౌకర్యంకోసం ఉచితంగా ఇచ్చానని చెప్పడం హాస్యాస్పందంగా ఉందన్నారు. రాజ్ థియేటర్ ప్రాంతంలో రోడ్డు వెడల్పులో భాగంగా నష్టపోయిన స్థలానికి ప్రభుత్వం టీడీఆర్ ద్వారా నష్టపరిహారం చెల్లించవలసి ఉంటే వీరికి నేరుగా కోటి42లక్షల2వేల990 రూపాయలను తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. ఉచితంగా ఇవ్వలేదన్నది ప్రజలు గ్రహించాలన్నారు. వీరితోపాటుగా నష్టపోయిన వారికి తాము ప్రభుత్వం ద్వారా 25కోట్ల నష్ట పరిహారాన్ని ఇప్పించేందుకు కృషిచేశామని తెలిపారు. అలాగే పద్మావతి నగర్లో ఇచ్చిన స్థలానికి టీడీఆర్ రూపంలో నష్ట పరిహారం అందుకున్నారని చెప్పారు. నంద్యాలలో అభివృద్ధి జరుగలేదని అసత్యపు ప్రచారాలు చేస్తున్న వీరికి నంద్యాల జిల్లాగా ఏర్పాటు కావడం, మెడికల్ కళాశాల, అర్బన్ హెల్త్ సెంటర్లు, నేషనల్ హైవే, అమృత్పథకం, పారలు, వైఎస్సార్ క్లినిక్ లను, ఆర్బీకేలు, రోడ్లు, డ్రైన్లు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాక్షాలుగా ఉన్నాయన్నది ప్రజలకు తెలుసన్నారు. అభివృద్ధి చేయలేదని చెప్పడం సమంజసంగా లేదన్నారు. నంద్యాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు సమ్మర్ స్టోరేజి ట్యాంక్ ను నిర్మాణం చేపట్టినది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సీఎంగా ఉన్న సందర్భంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఉన్న హయాంలో 12.5లతో 2005లో ప్రారంభించడం జరిగిందని ఇందుకు శిలాఫలకాలు సాక్షాలుగా ఉన్నాయని, వాటినికూడా కాదని ఫరూక్ తాను చేశానని అసత్యం పలకడం విడ్డూరంగా ఉందన్నారు. ఫిల్టర్ బెడ్లు ఏర్పాట చేశారని గుర్తు చేశారు. నిరుద్యోగలకు ఉపాధి అవకాశాలు కల్పించలేదని తమపై ఆరోపణలు చేస్తున్న ఫరూక్ వారి హయాంలోనే నంద్యాల షుగర్ ప్యాక్టరీ, నూలు మిల్లు మూత పడిందని అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. షుగర్ ప్యాక్టరీని 5కోట్లకు నాడు ఫరూక్ ఉన్న కాలంలో అమ్మడం జరిగిందన్నారు. వర్షాభావ పరిస్థితులపై సీఎం మాట్లాడలేదని చెప్పారని, చంద్రబాబు అధికారంలో ఉన్న కాలంలో వర్షాలు పడలేదని, తాము అధికారంలో ఉన్న కాలంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని రైతులకు రెండు కార్లు పంటలు సాగుకు నీరందించామని చెప్పారు. సుబ్బారెడ్డి పాలెం గ్రామంలో గ్రామంలోని కొందరిని స్థానిక దేవాలయంలో సమావేశం ఏర్పాటు చేసిన ఫరూక్ వారికి ఇష్టం లేకున్నా టీడీపీ పార్టీ కండువాలను కప్పి భలవంతంగా పార్టిలోకి చేర్చుకున్నారని, అంతే కాని తాము టీడీపీ కండువాలను మార్చలేదని స్పష్టం చేశారు. అభిమానంతో పార్టీలోకి రావాలని భలవంతాగా ఇబ్బందులు చేయరాదని హితవు పలికారు. తాము రైతు నగర్లో పొలాలు కొన్నామని అయితే నేషన్ హైవేకు పోయాయని 7 ఎకరాల స్థలానికి కేవలం 20లక్షలు మాత్రమే వచ్చిందని, తమకూ నంద్యాల పట్టణంలో స్థలాలు ఉంటే ఫరూక్ మాదిరి ఇచ్చేవారమన్నారు. రైతు కుటుంబం నుండి వచ్చామని కష్టపడి రాజకీయాల్లో ఉన్నామని ప్రజలతో ఓడినా, గెలిచిన వారికి సేవలను అందిస్తున్నామన్నారు. కరోనా కాలంలో ఫరూక్ ఎక్కడికి పోయారో చెప్పాలని, నాడు మేమంతా ప్రజల మధ్య ఉన్నామని, తమతో తమ కౌన్సిలర్లు, స్వచ్చంద సంస్థల సభ్యులు, మానవతావాధులు ఉన్నారని అండగా నిలిచామన్నారు. నంద్యాలలో జిల్లా మెడికల్ కళాశాల రావడానికి ఫరూక్ కు ఎక్కడ సంబంధం ఉందో చెప్పాలని, 2003లోనే ఫరూక్ ప్రతిపాధనలు చేసినట్లు అభూత కల్పనలు చేయడం గమనించాలన్నారు. మెడికల్ కళాశాల రాకుండా కోర్టులకు వెళ్లింది ఎవరో ఫరూక్ చెప్పాలన్నారు. మార్కెట్ యార్డుకు చెందిన కాంప్లెక్స్ లు నిరుపయోగంగా ఉంటే వాటిని వినియోగంలోకి తీసుకువచ్చి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అగ్రిమెంట్ మేరకు బాడుగలను చెల్లిస్తున్నామని తెలిపారు. 1989 మధ్య కాలంలో నిర్మించిన మార్కెట్ యార్డు కాంప్లెక్ లు నిరుపయోగంగా ఉంటే పట్టించుకోని ఫరూక్ వాటిని సద్వినియోగంలోకి తీసుకువచ్చి శిల్పా సహకార్ ద్వారా పేద ప్రజలకు 10శాతం ధరలను తగ్గించి అందిస్తున్నామన్నారు. మీరు కూడా తమ లాగా నంద్యాలలో సొంత స్థలాలు కలిగిన ఫరూక్ ప్రజలు సేవలను అందించవచ్చు అన్నారు. పాండురంగా పురంలో రైతుల సమ్మతి మీదనే తన చిన్నాన్న శిల్పా చక్రపాణిరెడ్డికి పొలాలను వెంచర్ కు అమ్మారని, వారికి డబ్బులను ఇచ్చామన్నారు. పాండురంగా పురంలో తమ పార్టీకి చెందిన మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పురుషోత్తం రెడ్డి, వారి సోదరునికి చెందిన పొలాలను కూడా వెంచర్ కు తీసుకోవడం జరిగిందన్నారు. ఎవ్వరినీ భలవంత పెట్టలేదని మార్కెట్ విలువకంటే రెండు రెట్లు అధికంగా కొన్నారన్నారు. శిల్పా కుటుంబానికి డబ్బు అహంకారం ఉందని, గొర్రెలను కొన్నట్లు కొంటామని చెప్పడం సరికాదని, ఎన్నడూ ఎక్కడా తాము ఈ విషయాన్ని ప్రస్తావించలేదని స్పష్టంచేశారు. రాజకీయాల్లో గెలిచినా ఓడినా నంద్యాల ప్రజలకు సేవలను కొనసాగిస్తున్నామని చెప్పారు. తప్పుడు ప్రచారాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. ప్రజల్లో టీడీపీ విశ్వసనీయత కోల్పోయిందని, అందుకే కూటమిగా ఎన్నికల్లో జగనన్నను ఢీ కొంటున్నారని, జగనన్న ఒంటరిగా వస్తున్నా భలవంతుడని, పారదర్శక పరిపాలన ఎలా ఉందో ప్రజలకు తెలుసని అన్నారు. ఎన్నికల్లో నూటికి నూరు శాతం రాష్ట్రంలో, నంద్యాలలో వైఎస్సార్సీపీ జెండా ఎగుర వేయడం ఖాయం అన్నారు. భారీ మెజారీటీ తథ్యం అని తెలిపారు.

previous post
next post