Tv424x7
Andhrapradesh

భార్య గొంతు కోసిన భర్త

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో భర్త భార్య గొంతు కోసి హత్యా యత్నానికి పాల్పడ్డ సంఘటన మదనపల్లిలో తీవ్ర కలకలం రేపింది. బాధితురాలు కుటుంబీకులు మదనపల్లి తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పై వివరాలు ఇలా ఉన్నాయి. పీటీఎం మండలంలోని మల్లెలకు చెందిన టైలర్ ఫజల్ మద్యం తాగొచ్చి భార్యతో గొడవ పడుతుంటే గులాబ్ జాన్ అలిగి మదనపల్లె లోని కొత్తపల్లె పంచాయతీ, కొత్త ఇండ్లు, తాళ్ల సుబ్బన్న కాలనీలో కాపురం ఉంటున్న పుట్టి నింటికి గులాబ్ జాన్ వచ్చింది. దీంతో ఆగ్రహించిన భర్త ఫజల్ అత్తగారి ఇంటిలో ఉన్న భార్య ఎస్కె గులాబ్ జాన్ ను గ్లాసుతో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు గమనించి వెంటనే ఆమెను చికిత్స కోసం స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించగా, ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించారు. అయితే ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని సీఐ ఎన్ శేఖర్ పేర్కొన్నారు.

Related posts

ట్రాఫిక్ నిబంధనలపై డ్రైవర్లకు అవగాహన కనిపిస్తున్న సిఐ

TV4-24X7 News

ఫిబ్రవరి 15 నుండి ఎమ్మెల్యే రాచమల్లు ఎన్నికల ప్రచారం

TV4-24X7 News

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయిని అడ్డుకున్న వైసీపీ శ్రేణులు..

TV4-24X7 News

Leave a Comment