జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం బ్రిడ్జి వద్ద గోదావరి నదిలో మంగ ళవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమ యింది. మృతుడి వయస్సు సుమా రు 40 నుంచి 45 మధ్య ఉంటుందని ధర్మపురి ఎస్సై పి. ఉదయ్ కుమార్ తెలిపారు. మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆసు పత్రిలో గల మార్చురీ గదిలో భద్రపరిచినట్లు చెప్పారు. చనిపోయిన వ్యక్తి గురించి వివరాలు తెలియవలసి ఉంది.ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై ఉదయ్ కుమార్ కోరారు..

previous post