కడప/ ప్రొద్దుటూరు :విదేశీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున గన్నవరం ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రిని కలిసినట్లు చెప్పారు. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్సీ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కోసం నిరంతరం సీఎం జగన్ పనిచేస్తారని కొనియాడారు.
