విశాఖపట్నం ఆపదలో ఉన్న దివ్యాంగులను కాపాడటానికి దివ్యాంగ సురక్ష కార్యక్రమం దోహదపడుతుందని నగర పోలీసు కమిషనర్ ఏ రవిశంకర్ అన్నారు. బీచ్ రోడ్డులోని విష్ణు ప్రియ ఫంక్షన్ హాల్లో సిటీ పోలీసు ఆధ్వర్యంలో దివ్యాంగులకు దిశా దివ్యాంగ సురక్షపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీపీ, ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి విచ్చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, దేశ వాప్తంగా ఉన్న మూడు కోట్లమంది దివ్యాంగులకు దివ్యాంగ సురక్షతో ద్వారా మేలు చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా హర్ష సాయి మాట్లాడుతూ దిశా దివ్యాంగ సురక్షకు తనను బ్రాండ్ అంబాసిడర్గా నియమించారన్నారు.

next post