కడప / మైదుకూరు : దువ్వూరు మండలంలో సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పీజీ ఆర్ఎస్) కార్యక్రమం ఉంటుందని తహసిల్దార్ ఉమారాణి ఆదివారం ఒక ప్రకటనల పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో స్పందన కార్యక్రమం బదులుగా ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్) కార్యక్రమం ఉంటుందని ఆమె తెలిపారు కావున ఎవరైనా అర్జీదారులు తమ సమస్యలను తెలుపుకొనుటకు ప్రతి సోమవారము తహసిల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల ప్రజా వేదిక కార్యక్రమంలో అర్జీలు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు
