నారాయణపేట పట్టణంలోని యూసఫ్ తాజ్ అనే వ్యక్తి కిరాణం దుకాణంలో శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో నిషేధిత గుట్కా, జార్దా ప్యాకెట్ల పట్టుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. రూ. 16, 368 విలువ గల గుట్కా, జార్దా ప్యాకెట్లను సీజ్ చేశామని అన్నారు. దుకాణం యజమాని యూసఫ్ తాజ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నిషేధిత గుట్కా, జార్దా ప్యాకెట్ల అమ్మిన, నిల్వ చేసిన చర్యలు తీసుకుంటామని అన్నారు

previous post
next post