విశాఖపట్నం శ్రీ స్వామి వివేకానంద స్వచ్చంద సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్.సి.ఎం.ఎ.జహీర్ అహ్మద్, ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల రౌండ్ టేబుల్ సంస్థ చైర్మన్ మాకసూద్ అహ్మద్ ఆధ్వర్యంలో, వివేకానంద సంస్థలో పేదవాళ్లకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల్లో రౌండ్ టేబుల్ సంస్థకు చైర్మన్ గా ఎన్నికైన మక్సుద్ అహ్మద్ ని డాక్టర్, సంస్థ అధ్యక్షులు అప్పారావు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, రౌండ్ టేబుల్ సంస్థ వారు, గోషా ఆసుపత్రిలో పేషంట్ల సహాయకులకు 10 రూపాయలకే వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో భోజనాలు అందించడం, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సంస్థ వారిని ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా సంస్థకు పలు విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని మాకసూదాహ్మద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రౌండ్ టేబుల్ సంస్థ సభ్యులు రవి వర్మ, సంస్థ అధ్యక్షులు అప్పారావు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

next post