Tv424x7
Telangana

జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.తెలంగాణలో చేపట్టబోతు న్న జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహిం చారు. సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నేషనల్ హైవేల నిర్మాణాల ప్రస్తుత స్టేటస్ పై అధికారు లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.రీజనల్ రింగ్ రోడ్డు, మంచి ర్యాల-వరంగల్-ఖమ్మం-విజయవాడ కారిడార్ భూసేకరణలో పురోగతిపై ఆరా తీశారు. ఈ నెలాఖారులోగా పూర్తి వివరాలు, ప్రపోజల్స్ ను ఉన్నతాధికారులకు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్.

Related posts

.నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

TV4-24X7 News

నవంబర్ 20 వరకు ఇందిరమ్మ లబ్ధిదారుల లిస్ట్..!!

TV4-24X7 News

వారంలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ : మంత్రి సీతక్క..!!

TV4-24X7 News

Leave a Comment