పాల్వంచ టౌన్ ఎస్.ఐ బాణాల రాము గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుంచి ఎస్ఐ రాము రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు.ఈ కేసు వాదిస్తున్న న్యాయవాది లక్ష్మారెడ్డి కి మహిళ ఈ విషయం చెప్పింది.దీంతో న్యాయవాది ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు.తన ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు ఎస్ఐ ను పట్టుకున్నారు.

previous post