Tv424x7
Andhrapradesh

పుంగనూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ

పుంగనూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిగింది. ఈ పిటిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని పెద్దిరెడ్డితో పాటు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన చల్లా రామచంద్రారెడ్డి, ఇతర పార్టీల అభ్యర్థులు, ఆర్‌వో, జిల్లా ఎన్నికల అధికారికి నోటీసులు జారీచేసింది. పుంగనూరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ కేసుపై అవగాహన కోసం నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సెప్టెంబరు 9కి వాయిదా వేసింది.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన భార్య స్వర్ణలతలకు చెందిన 142 ఆస్తుల వివరాలు పొందపరచలేదని.. కాబట్టి ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని బీసీవైపార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్‌ హైకోర్టును ఆశ్రయించారు. గత నెల 4న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈపీ నెంబరు 3/2024ను జస్టిస్‌ శ్రీనివాస్‌ గత నెల 24, 31వ తేది, బుధవారం విచారణ జరిపారు. గత వాయిదాలోనే గెలుపొందిన వారి తర్వాత అధికంగా ఓట్లు వచ్చిన పుంగనూరు టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిని ఈకేసులో ఇంప్లీడ్‌ కావాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Related posts

లోకేష్ ఈ కాలపు టార్చ్ బేరర్ – తేల్చేసిన హరీష్ రావు..!

TV4-24X7 News

జిల్లాలో డయేరియా నివారణకు పగడ్బందీ చర్యలు చేపట్టాలి…

TV4-24X7 News

శ్రీ విజయ దుర్గ దేవి నవరాత్రుల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment