విశాఖపట్నం కంచరపాలెం భర్తతో విభేదాలు కారణముగా ఇంటి నుండి అలిగి వెళ్లిపోయిన మహిళ ఆచూకీ గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన నగర పోలీసులు. భర్తతో విభేదాలు కారణముగా ఇంటి నుండి అలిగి వెళ్లిపోయిన మహిళ కై కంచరపాలెం పోలీసు స్టేషన్ నందు మిస్సింగ్ కేసు నమోదు చేసి, తక్షణం వారి ఆచూకీ కోసం విచారణ జరిపి గురువారం రాజమండ్రి వద్ద గుర్తించి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగినది. సదరు మహిళ ను తిరిగి భద్రముగా అప్పగించిన విశాఖ నగర పోలీసులకు సదరు మహిళ కుటుంబ సభ్యులు తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నగర పోలీస్ కమిషనర్ నగర పోలీసు కమీషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., మహిళ ఆచూకీ గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన సిబ్బందిని అభినందించారు.

previous post
next post