అయ్యప్పలకు అన్నదానం చేస్తున్న కార్పొరేటర్ భీశెట్టి వసంత లక్ష్మీ తదితరులు
విశాఖపట్నం జీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయ్యప్పలకు శనివారం బంగారుమెట్టలో అన్నస మారాధన నిర్వహించారు. ఈ కార్య క్రమంలో జీకే ఫౌండేషన్ చైర్మన్ భీశెట్టి గోపి కృష్ణ, 33వ వార్డు కార్పొరేటర్ భీశెట్టి వసంత లక్ష్మీలు పాల్గొని అయ్యప్పల సేవలో తరిం చారు. ప్రతి ఏడాది అయ్యప్పలకు అన్నదానం చేయడం ఆనవాయితీగా వస్తోం దన్నారు. ఈ కార్యక్రమంలో బంగారు మెట్టతో పాటు వేంకటేశ్వరమెట్ట, నీలమ్మవేప చెట్టు తదితర ప్రాంతాల నుంచి అయ్యప్పలు పాల్గొని భిక్ష స్వీకరించారు.