హైదరాబాద్: ఈనెల 9న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ములుగు జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చినట్టు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ స్పష్టం చేశారు..పోకలమ్మ వాగు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం ఏడుగులు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక అటు ఏటూరునాగారంలో మావోయిస్టుల ఎన్కౌంటర్పై బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏటూరునాగారంలో మావోయిస్టుల ఎన్కౌంటర్పై మాకు అనుమానాలు ఉన్నాయని బాంబ్ పేల్చారు. ఫేక్ ఎన్కౌంటర్లు ఎప్పటికైనా తప్పే.. గతంలో కేసీఆర్ కూడా ఎన్కౌంటర్లకు ఒప్పుకోలేదన్నారు..

previous post