Tv424x7
Telangana

మా పెళ్ళికి రండి: సీఎం రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన పీవీ సింధు!

హైదరాబాద్:భారత షెట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఈ రోజు సాయంత్రం తెలం గాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కుటుంబ సభ్యులతో సీఎం నివాసానికి వెళ్లిన సింధు ఈ నెల 22న రాజస్థాన్ లో జరిగే తన వివాహానికి రా వాలని.. సీఎంకు శుభలేఖ అందించి ఆహ్వానించి ఆహ్వానం పలికారు. కాగా ఈ రోజు మధ్యహ్నం కుటుంబ సభ్యుల నడుమ ఎంగేజ్‌మెంట్‌ నిర్వహిం చారు. ఈ సందర్భంగా పీవీ సింధు, వెంకట దత్తసాయి రింగ్స్‌ మార్చుకున్నారు. ఎంగేజ్‌మెంట్‌ ఫొటోను సింధు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నది.ఒకరి ప్రేమ దక్కిన సమయంలో.. తిరిగి మనం ప్రేమించాలి” అని క్యాప్షన్‌ తో ఫొటోను షేర్‌ చేసింది. ఎంగేజ్‌మెంట్‌ సందర్భంగా ఇద్దరూ కేక్‌ కట్‌ చేశారు. సింధు వివాహ వేడుక ఈ నెల 22న రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లోని ప్యాలె స్‌లో ఘనంగా నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Related posts

తెలుగు కళామతల్లికి చిరంజీవి మూడో కన్ను: వెంకయ్యనాయుడు

TV4-24X7 News

చంద్రబాబు ముందు రేవంత్ డిమాండ్ ఇదే!

TV4-24X7 News

ఇవాళ, రేపు భారీ వర్షాలు

TV4-24X7 News

Leave a Comment