Tv424x7
Telangana

హైదరాబాద్‌లో 100 అడుగుల NTR విగ్రహం.. ఆ ప్రాంతంలోనే, సీఎం రేవంత్‌ కీలక హామీ

ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహం హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ కార్యచరణ సిద్ధం చేస్తోంది. నగర శివారు ఔటర్ రింగు రోడ్డు సమీపంలో విగ్రహా ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉండగా.. స్థలం కేటాయింపుపై సీఎం రేవంత్ కీలక హామీ ఇచ్చారు.విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత నందమూరి తారక రామారావుకు హైదరాబాద్‌లో అరుదైన గౌరవం దక్కనుంది. నగరంలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ కుమారుడు మోహనకృష్ణ, ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ ఛైర్మన్‌ టీడీ జనార్దన్, సభ్యుడు మధుసూదనరాజు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విగ్రహ ప్రతిష్ఠాపనపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ వారికి కీలక హామీ ఇచ్చారు.నగరంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం తరపున తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగురోడ్డు సమీపంలో 100 అడుగుల ఎత్తుతో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని నెలకొల్పాలని అనుకుంటున్నామని ఈ సందర్భంగా సీఎంకు వారు వివరించారు. ఎన్టీఆర్‌ నాలెడ్జి సెంటర్‌ను సైతం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసే చోట పర్యాటక కేంద్రంగా అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అవసరమైన స్థలం కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కమిటీ సభ్యులు కోరారు.అందుకు సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. ఎన్టీఆర్‌ విగ్రహ ప్రతిష్ఠాపనకు ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో స్థలం మంజూరు చేయడానికి సీఎం అంగీకరించారని సీఎంతో భేటీ అనంతరం లిటరేచర్‌ కమిటీ తెలిపింది. త్వరలోనే స్థలం కేటాయింపులు ఉంటాయని.. ఆ తర్వాత విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రీతక అని ఆయన్ను స్మరించుకునేందుకు.. భావి తరాలకు ఆయన గొప్ప తనం చాటి చెప్పేందుకు విగ్రహ ఏర్పాటుకు పూనుకున్నట్లు తెలిపారు.కాగా, సినిమాల ద్వారా ఆశేష జన అభిమానాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ 1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించారు. ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తరువాత మూడు దఫాలు, మెుత్తంగా 7 సంవత్సరాల పాటు ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు. 1996 జనవరి 18 ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. ప్రస్తుతం ఉన్న చాలా మంది రాజకీయ నాయకులు ఎన్టీఆర్ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఘన నివాళి అర్పించేందుకు నగరంలో 100 అడుగుల విగ్రహానికి ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చారు.

Related posts

హైదరాబాద్ నగరంలో మహిళ దారుణ హత్య?

TV4-24X7 News

మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు ఖాయం

TV4-24X7 News

బిజెపి ఎమ్మెల్యే మునిరత్న అరెస్ట్?

TV4-24X7 News

Leave a Comment