ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ వేదికగా శనివారం సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7 గంటలకు టాస్ పడనుంది. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలవ్వనుంది. ఐపీఎల్లో ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 23 సార్లు తలపడగా.. అందులో SRHదే పైచేయిగా ఉంది. సన్రైజర్స్ హైదరాబాద్ 16 మ్యాచ్ల్లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్ల్లో గెలుపొందింది.
