Tv424x7
Andhrapradesh

మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం గారి చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి లోకేష్

పల్లా కుటుంబ సభ్యులకు పరామర్శ

విశాఖపట్నం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం గారికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. గత శనివారం ఆయన స్వర్గస్థులయ్యారు. నేడు ఉదయం విశాఖ సీతంపేటలోని పల్లా శ్రీనివాసరావు నివాసానికి చేరుకున్న మంత్రి లోకేష్.. అక్కడ పల్లా సింహాచలం గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పల్లా సింహాచలం గారు మంచికి మారుపేరుగా నిలిచారని, విశాఖ-2 ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేశారని ఈ సందర్భంగా ఆయన సేవలను మంత్రి గుర్తుచేసుకున్నారు. పల్లా శ్రీనివాసరావు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పల్లా సింహాచలం గారి మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎంపీ శ్రీ భరత్, హోంమంత్రి వంగలపూడి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామితో పాటు పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఏపీలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

TV4-24X7 News

ప్రతి మండలంలో భూ రీ సర్వే త్వరగతిన పూర్తి చేయాలి రెవిన్యూ డివిజనల్ అధికారి ఇ.కిరణ్మయి అదేశలు

TV4-24X7 News

వైసీపీ ఘోర ఓటమి.. కీలక నేత రాజీనామా

TV4-24X7 News

Leave a Comment