అనుమానంతో గొడవలు.. గోడకేసి కొట్టడంతో మహిళ మృతి.
హైదరాబాద్కు చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని, క్షణికావేశంలో మహిళపై దాడి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక ఐఏఎస్ అధికారి.
గత ఏపీ ప్రభుత్వంలో కీలకమైన శాఖకు అధిపతిగా వ్యవహరించి, సీఎం పేషీలో కూడా పనిచేసిన సదరు ఐఏఎస్ అధికారి.
గత కొన్నేళ్లుగా హైదరాబాద్కు చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని, కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మహిళతోనే ఎక్కువగా గడుపుతున్న ఐఏఎస్.
ఇటీవల ఒక వ్యాధితో బాధపడుతూ, ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో మహిళ వేరే వ్యక్తులతో సన్నిహితంగా ఉంటుందని అనుమానం పెంచుకొని మహిళతో గొడవ పడి, ఆమెపై దాడి.
దాడిలో ఆమె తల గోడకు బలంగా తాకడంతో, తీవ్ర రక్తస్రావంతో మృతి చెందిన మహిళ.
తన పలుకుబడితో మెట్ల మీదనుండి కింద పడిపోయిందని ఆసుపత్రి రికార్డులలో రాయించిన ఐఏఎస్.
ఏమి తెలియనట్టు విజయవాడ తిరిగి వెళ్లి విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్, విషయం తెలిసి ఆశ్చర్యానికి గురవుతున్న తోటి అధికారులు.