Tv424x7
Andhrapradesh

ఫిబ్రవరి 15 నుండి ఎమ్మెల్యే రాచమల్లు ఎన్నికల ప్రచారం

కడప /ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫిబ్రవరి 15 వ తేదీ నుంచి ఎన్నీకల ప్రచారం మొదలు పెట్టనున్నానని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక నడింపల్లి వీధి లోని 17 వ వార్డు కౌన్సిలర్ చరితా రెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మూడవ సారి ఎమ్మెల్యే గా గెలిపించాలని కోరారు. కరోనా కాలంలో ఏ ఒక్క తెలుగు దేశం పార్టీ నాయకులు కనిపించలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే నాకంటే నాకంటూ టికేట్ కోసం తాపత్రయం పడటం తప్ప ప్రజల కోసం ఏ తెలుగు దేశం పార్టీ నాయకులు లేరని స్పష్టం చేశారు. తమ కౌన్సిలర్ లను ప్రలోభాలు పెట్టడం సమంజసం కాదన్నారు. ప్రజాసేవ కోసమే రాచమల్లు వున్నాడని ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అని వివరించారు.

Related posts

రైస్ మిల్లుపై అకస్మిక తనిఖీ

TV4-24X7 News

ఏపీ రాజధాని ‘అమరావతి’ డిజైన్లలో మార్పుల్లేవ్: నారాయణ

TV4-24X7 News

స్వచ్ఛభారత్ దివాస్ కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment