కడప జిల్లా మైదుకూరు పరిధిలోని దువ్వూరు నుంచి ప్రొద్దుటూరుకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపి వేయడంతో విద్యార్థులు, ప్రజలు పోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఉదయం 7 నుండి నుండి 9:30 ప్రాంతంలో విద్యార్థులకు చాలా కష్టం అవుతుంది పాఠశాలకి, కాలేజీలకు పోవాలంటే అష్టకష్టాలు పడుతున్నారు. గతంలో ఆర్టీసీ బస్సులు తిరిగేవి తీసేశారు. దీనితో వాణిజ్య పరంగా ప్రొద్దుటూరు వెళ్లాలనుకునే వ్యాపారస్థులు, ప్రయాణికులు వైద్యం కోసం వ్యాపారం కిరాణా సరుకులు బంగారు ఆభరణాలు కొనుగోలు కోసం చుట్టుపక్కల పల్లెల నుండి దువ్వూరు మీదుగా వెళ్ళాలి ఉద్యోగులు, విద్యార్థులు సమయానికి వెళ్లలేక మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రొద్దుటూరు ఆర్టీసీ ప్రజలను, విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని గతంలోల ప్రొద్దుటూరు నుంచి దువ్వూరుకి బస్సు సర్వీస్ పునరద్దరించాలని దువ్వూరు మండల ప్రజలు కోరుతున్నారు
