నెల్లూరు జిల్లా: కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో వెహికల్/బ్రేక్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
టోల్ ప్లాజా వద్ద వాహనాలను నిలిపి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గోపీనాథ్కు చెందిన కారును తనిఖీ చేయగా రూ.2.48 లక్షల నగదు గుర్తించినట్లు తెలుస్తోంది.నగదుతో పాటు కారును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం గోపీనాథ్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.ఈ తనిఖీలకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు, ఇతర అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. నగదు ఎక్కడి నుంచి వచ్చింది? వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లకు సంబంధం ఉందా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: