మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత లక్ష్మణ్ ఆత్రంతో సహా 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
