Tv424x7
Andhrapradesh

ఎర్నిమాంబ అమ్మవారికి ప్రత్యేక హారతులు ఇస్తున్న అర్చకులు శ్రీకాంతశర్మ

విశాఖపట్నం జ్ఞానాపురం కూడలిలో వెలసిన ఎర్నిమాంబ అమ్మవారి ఆలయం ఆషాఢ శుద్ధ అష్టమి ఆదివారాన్ని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది. ఈవో డీవీఎస్ సురేష్ బాబా ఆధ్వర్యంలో ఆలయ పూజారమ్మ వాసు పల్లి విజయమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలకంరించారు. ఆలయ అర్చకులు పులఖం డం శ్రీకాంత్ శర్మ ఉదయం నుంచి అమ్మవారికి కుంకుమ పూజలు, విశేషార్చనలు, అభిషే కాలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ప్రత్యేక ఉచిత దర్శనాలతో పాటు రూ. 10, రూ. 50 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆలయ సిబ్బంది రామకృష్ణ నేతృత్వంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు.

Related posts

అంబేడ్కర్ గురుకులం ను పట్టించుకోని డీసీఓ:-ఎఐవైయఫ్

TV4-24X7 News

ఆధార్ KYC ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు

TV4-24X7 News

కడప జిల్లా నాయకులకు బహిష్కరణ నోటీసులు

TV4-24X7 News

Leave a Comment