ఏపీలో వారానికి రెండు రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్
అమరావతి :ఏపీ అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు మరింత రుచికరమైన, ఎక్కువ పోషకాలుండే ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేంద్రాలకు వచ్చే 3-6 ఏళ్ల వయసున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేయనుంది. వారంలో రెండు రోజులు మధ్యాహ్నం వేళ ఎగ్ ఫ్రైడ్లైస్, అదేరోజు ఉదయం అల్పాహారంగా ఉడికించిన శనగలు అందించనుంది. అన్ని కూరలు, పప్పులో మునగ పొడిని వినియోగించనుంది.