విశాఖపట్నం 21వ వార్డులో ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీంట్లో పౌరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పీతల అవినాష్ వార్డు ప్రెసిడెంట్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు అమలు చేస్తుందో వాటన్నిటిని పాటిస్తూ ఈ ఎండాకాలంలో సరైన పద్ధతులు పాటిస్తూ ఎండకి తట్టుకునే విధంగా చిన్న పిల్లలు ముసలి వాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు పర్యావరణ కార్యదర్శిలు మరియు పారిశుద్ధ్య సూపర్వైజర్లు పాల్గొనడం జరిగింది సానిటరీ ఇన్స్పెక్టర్ గోవిందరావు పర్యావరణ కార్యదర్శులులావణ్య శ్రీ, భాను, నారాయణ రావు పారిశుద్ధ్య మేస్త్రి మురళి సూపర్వైజర్లు కార్తీక్ రఫీ శ్రీను సురేష్ తదితరులు పాల్గొన్నారు.
