Tv424x7
Telangana

గ‌ద్ద‌ర్ ఫౌండేష‌న్‌కు రూ.3 కోట్లు మంజూరు….

గ‌ద్ద‌ర్ జ‌యంతి వేడుక‌ల్లో ఫౌండేష‌న్‌కు భాగ‌స్వామ్యం

హైద‌రాబాద్‌: ప్ర‌జా యుద్ధ నౌక గ‌ద్ద‌ర్ ఆలోచ‌న‌లు, ఆయ‌న ఆశ‌యాల‌ను ముందుకు తీసుకెళ్లేందుకు గానూ గ‌ద్ద‌ర్ ఫౌండేష‌న్‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఫౌండేష‌న్‌కు అవ‌స‌ర‌మైన నిధులు కేటాయిస్తామ‌ని గ‌తంలో జ‌రిగిన గ‌ద్ద‌ర్ జ‌యంతి వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేర‌కు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్య‌మం, సాంస్కృతిక రంగంపై త‌నదైన ముద్ర వేసిన గ‌ద్ద‌ర్ సేవ‌ల‌కు గుర్తింపుగా ఆయ‌న జ‌యంతిని రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా జ‌రుపుతోంది. ఇక ముందు గ‌ద్ద‌ర్ జ‌యంతి వేడుక‌ల కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లోనూ గ‌ద్ద‌ర్ ఫౌండేష‌న్‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తూ మ‌రో ఉత్త‌ర్వును ప్ర‌భుత్వం జారీ చేసింది.

Related posts

మహిళలకు రూ.50 వేలు.. ఇలా పొందండి

TV4-24X7 News

చార్మినార్ దగ్గరకు కేటీఆర్..

TV4-24X7 News

న్యూ ఇయర్ విషెస్ పేరుతో సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్, బుట్టలో పడితే బిస్కట్ అవుతారు

TV4-24X7 News

Leave a Comment