ఏపీ: గత వైసీపీ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని మంత్రి పార్థసారథి విమర్శించారు. విద్యా దీవెన, అమ్మఒడి ద్వారా చదువుకున్న పిల్లల భవిష్యత్తు గురించి ఏనాడైనా ఆలోచించారా అని జగను ప్రశ్నించారు. వైసీపీ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాలేకపోయారని, అప్పటికే ఉన్న సంస్థలు ఉండలేమంటూ పారిపోయాయని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టుబడులకు ముందుకు వస్తున్నారని మంత్రి వెల్లడించారు.

previous post
next post