Tv4 24×7( సిద్దిపేట జిల్లా స్టాపర్) సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండలం, పాములపర్తి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ మర్కుక్ మండలం యూత్ ప్రెసిడెంట్ తాండ మదన్ గౌడ్ మీడియా తో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో గజ్వేల్ పట్టణంలో వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని, జిల్లా ఆస్పత్రి, మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి, మహతి ఆడిటోరియం, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, సమీకృత కూరగాయల మార్కెట్, పాండవుల చెరువు మినీ ట్యాంక్ బండ్, రింగ్ రోడ్డు, ఎడ్యుకేషన్ హబ్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మా ణం జరిగాయన్నారు. ఎంతటి అభివృద్ధి లో కలెక్టర్గా వెంకటరామిరెడ్డి తన బాధ్యతను నిర్వహించారని ఉద్యోగరీత్యా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆయన ఎన్నో సేవలు చేశారని, అంతే కాకుండా మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో రాజకీయంగా మరింత సేవ చేయడానికి ముందుకు వచ్చారని పివిఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. బి ఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఓరువలేక పోతున్నారని కరీం ఆరోపించారు

next post