విశాఖపట్నం రైటర్స్ అకాడమీ వ్యవస్థాపకులు వి .వి . రమణమూర్తి ఆధ్వర్యంలో, దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ ని గౌరవ ప్రధమంగా వివేకానంద సంస్థ వారు కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థ ద్వారా నిర్వహిస్తున్న నిత్య అన్నదానాలు గురించి, వృద్ధాశ్రమం గురించి, గోషా హాస్పిటల్ లో పేషంట్ల సహాయాకులకు భోజనాలు అందించడం మొదలైన సేవ కార్యక్రమాల గురించి రమణ మూర్తి , సంస్థ సభ్యులు వివరించడం జరిగింది. వివేకానంద సంస్థ అధ్యక్షులు అప్పారావు వంశీకృష్ణ కి సాలువ వేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ మహిళా సభ్యులు సుజాత, రత్న, ఉమాదేవి, కనకమహాలక్ష్మి మొదలైన వారు పాల్గొన్నారు.

previous post