కొడాలి నాని పై కేసు నమోదు..వాలంటీర్ల ఫిర్యాదు మేరకు గుడివాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు..ఎన్నికల ముందు వార్డు వాలంటీర్లతో వైసిపి నాయకులు రాజీనామాలు చేయించారు. వార్డు వాలంటీర్ల పై కేసులు నమోదవడంతో వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించడమే కాకుండా పింఛన్ ఇవ్వకుండా ఈసీ ఆదేశించింది. తమను వేధించిన వారిలో కొడాలి నాని కూడా ఒకరని ఆయన మాటలు విని మేము రాజీనామా చేసి నష్టపోయామని వాలంటీర్లు పేర్కొన్నారు. కొడాలి నాని మరియు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్ మరియు గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల రాజు మరికొందరు వైసీపీ నేతలపై 407,506,RW/34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

previous post