తెలంగాణ బడ్జెట్ 2024లో తెలంగాణ రైతులకు తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు.భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.ఈ ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు భట్టి.తెలంగాణ వచ్చిన తర్వాత రైతు కూలీలకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.

previous post