Tv424x7
Telangana

రాజ్యసభ బిజెపి అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్:డిసెంబర్ 09మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్ధులను ప్రకటించింది. ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్య, హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లను ఖరారు చేసింది. బీసీ ఉద్యమ నేత కృష్ణయ్య ఇటీవల వైసీపీకి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ ఆయనకు మరోసారి అవకాశం కల్పించింది. ఇక రాజ్యసభ ఉపఎన్నికల నామినేషన్‌కు తుదిగడువు రేపటితో ముగియనుంది. కూటమి తరపున రేపు ముగ్గురు నేతల నామి నేషన్‌ వేయనున్నారు. అందులో బీజేపీ నుంచి ఆర్‌.కృష్ణయ్య నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి విజయ వాడ బయల్దేరారు ఆర్‌. కృష్ణయ్య. రేపు ఉదయం 11 గంటలకు ఆర్ కృష్ణ య్య, బీద మస్తాన్‌రావు నామినేషన్‌ వేయను న్నారు.అటు కూటమి తరపున మూడో అభ్యర్థి విషయంలో ఇంకా సస్పెన్స్‌ కొనసాగు తోంది. సానా సతీష్‌తో పాటు పలువురి పేర్లు పరిశీలినలో ఉన్నట్టు తెలుస్తోంది. సానా సతీష్‌ విషయంలో కూటమి పార్టీల ఏకాభి ప్రాయ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబును ఆశావ హులు కలుస్తుండటం గమనార్హం.

Related posts

గజ్వేల్ శ్రీరామ్ ఫైనాన్స్ నందు ఉద్యోగ అవకాశాలు

TV4-24X7 News

2, 3 రోజుల్లో DSC పూర్తి షెడ్యూల్?

TV4-24X7 News

కొమురం భీం జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

TV4-24X7 News

Leave a Comment