అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం లో రోడ్డు ప్రమాదాల నివారించుటలో భాగంగా ఎస్సై రామకృష్ణ మరియు సిబ్బంది ప్రమాద స్థలం మరియు మలుపులను గుర్తించారు. సంబంధిత ప్రదేశాలలో ప్రమాదాలను తగ్గించుటకు 21 ప్రమాద హెచ్చరిక బోర్డులను ( NH 40 ) ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా SI రామకృష్ణ మాట్లాడుతూ నేషనల్ హైవే లలో అతి వేగంగా వాహనాలను నడుపు సమయాలలో సరైన అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగు అవకాశాలు ఉన్నందున ప్రమాదాలను తగ్గించుటకు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశామని తెలిపారు
