Tv424x7
Andhrapradesh

టీ ఆపరేషన్స్ సెంటర్లో జీవీఎంసీ కమిషనర్ సీవోసీ పనితీరును తెలుసుకుంటున్న జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్

విఖపట్నం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సిటీ ఆపరేషన్ సెంటర్ను కమిషనర్ సంపత్ కుమార్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ అందుతున్న సేవలను పర్యవేక్షక ఇంజనీర్ వినయ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. సెంటర్ ఉద్యోగుల వివరాలు, విధులు, ప్రతిరోజూ వస్తున్న ఫిర్యా దులు, పరిష్కరణపై ప్రజాభిప్రాయాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అందిస్తున్న సమాచార వివరాలు ఫ్లూయింటిగ్రిడ్ ప్రాజెక్టు మేనేజరు శ్రీనివాస్, ఆపరే షన్స్ మేనేజరు సమీరా తెలిపారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ప్రజలతో సిటీ ఆపరేషన్స్ సెంటర్ సిబ్బంది గౌరవప్రదంగా మాట్లాడి, వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సీఓసీ ద్వారా అన్ని సర్వీసులు పూర్తిస్థాయిలో జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కార్యనిర్వాహక ఇంజనీరు సుబ్బారావు, స్మార్ట్ సిటీ మేనేజర్ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉక్కు ప్రైవేటీకరణపై పవన్ క్లారిటీఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

TV4-24X7 News

సోషల్‌ మీడియా పోస్ట్‌లపై ప్రత్యేక బృందాల నిఘా

TV4-24X7 News

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి**

TV4-24X7 News

Leave a Comment