విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జీవీఎంసీ అభివృద్ధి పనులు రూ1.40 లక్షలతో నిధులుతో జీవీఎంసీ 35వ వార్డు డాల్ఫిన్ సెంటర్ నుంచి కొత్త రోడ్డు జంక్షన్ వరకు జరుగుతున్న తారు రోడ్డు పనులను టీడీపీ పార్టీ 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు మంగళవారం అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ తార్ రోడ్డు వల్ల పలు కాలనీలకు మంచి మార్గంగా ఉంటాదని ప్రజలు ఎక్కడ అవస్థలు పడకుండా తారు రోడ్ నిర్మాణ పనులు చేపడుతున్నామని, నాణ్యత ప్రమాణాలు పాటించి రోడ్డు పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
