Tv424x7
Andhrapradesh

పశ్చాత్తాపం తో భార్య సమాధి వద్ద భర్త ఆత్మహత్య?

చిత్తూరు జిల్లా: డిసెంబర్09 క్షణికావేశంలో చేసిన తప్పుకు పశ్చాతాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది,భార్య సమాధి దగ్గర భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. రామకుప్పం మండలం బైపరెడ్లపల్లికి చెందిన గంగిరెడ్డి, సుజాత, కూరగాయల వ్యాపారం చేస్తూ జీవించే వారు, కొద్దిరోజుల క్రితం నుండి భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయి భార్య భర్తలు ఇంట్లో గొడవ పడగా క్షణికావేశంలో తన భార్య సుజాతపై కత్తితో దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ వెంటనే గంగిరెడ్డి పోలీసులకు లొంగిపో యాడు. ఆరు నెలల జైలుశిక్ష అనంరతం శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇంటికి వచ్చిన అతడు తన భార్య సుజాత సమాధి దగ్గర ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

Related posts

వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న..

TV4-24X7 News

ఇక రైళ్లలోనూ ఏటీఎం సేవలు..!*

TV4-24X7 News

నాగబాబు ట్వీట్ ఎవరి కోసం?

TV4-24X7 News

Leave a Comment