Tv424x7
Andhrapradesh

వైసీపీకి పెద్ద షాక్ – బీజేపీలోకి పోతుల సునీత దంపతులు!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత దంపతులు నేడు విశాఖపట్నంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో అధికారికంగా చేరబోతున్నారు.

ఇటీవల ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి రాజీనామా చేసిన సునీత దంపతుల నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ పదవీ కాలం ఇంకా ఉండగానే వైసీపీని వీడటాన్ని పర్యవేక్షకులు పెద్ద దెబ్బగానే భావిస్తున్నారు.

ఇక వైసీపీకి సొంతగడ్డ అయిన పులివెందులలోనూ పరిస్థితులు అనుకూలంగా లేవు. షర్మిల తన కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని ప్రకటించడంతో, అక్కడ వైసీపీ భవిష్యత్తుపై ప్రశ్నార్థక వాతావరణం నెలకొంది.

అదే సమయంలో, పార్టీ సీనియర్ నేతల్లో కొందరు కాంగ్రెస్ వైపు చూపులు మళ్లించడం, మరికొందరు కూటమి వైపు ఆశ చూపించడం గమనార్హం. ముఖ్యంగా బొత్సా సత్యనారాయణ కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారని వినిపిస్తోంది.

రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం –

జగన్‌పై ఉన్న బెయిల్ రద్దు కేసులు

దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్లో జరుగుతున్న విచారణ
వైసీపీ భవిష్యత్తుపై తీవ్రమైన మబ్బులు కమ్ముకున్నట్లే కనిపిస్తున్నాయి.

Related posts

రేపటి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

TV4-24X7 News

నకిలీ ఉపాధ్యాయ నియామకాలతో రూ. 2 కోట్ల మోసం!!

TV4-24X7 News

ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు..

TV4-24X7 News

Leave a Comment