కర్నూలు:
పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమోటా ధరలు అమాంతంగా పడిపోవడంతో రైతులు ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించారు. కిలో టమోటా రూపాయికి కూడా కొనుగోలు జరగడం లేదని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు.
మద్దతు ధర ప్రకటించమని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన వ్యక్తం చేసిన కారణంగా మార్కెట్ సమీపంలో ట్రాఫిక్ స్తంభించింది. నాణ్యత కారణంగా ధర తగ్గిస్తూ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు ప్రభుత్వాన్ని సమయానికి చర్యలు తీసుకోవాలని మళ్లీ మళ్లీ కోరుతున్నారు

