దువ్వూరు, మే 21: దువ్వూరు మండలం నీలాపురం యూనిట్ పరిధిలోని గోపులాపురం గ్రామంలో రైతులకు PMDS (Participatory Managed Dry Sowing) విధానం మరియు విత్తన గుళికల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో FMT, DMMT శ్రీమతి కే. చంద్రమ్మ గారు రైతులకు శిక్షణ అందించారు. రైతు సి. పెద్దబాలిరెడ్డి పొలంలో విత్తన గుళికల తయారీ విధానం, వాటి ఉపయోగాలు మరియు PMDS పద్ధతి ద్వారా కలిగే ప్రయోజనాలపై రైతులకు వివరించారు.అలాగే, రైతులకు ప్రత్యక్షంగా విత్తన గుళికల తయారీ డెమో నిర్వహించి చూపించారు. విత్తన గుళికల వలన మొలకలు మెరుగ్గా రావడం, విత్తన సంరక్షణ, దిగుబడి పెరుగుదల వంటి ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అనంతరం పెద్దబాలిరెడ్డి పొలంలో విత్తన గుళికలు తయారు చేసి PMDS విధానాన్ని అమలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ICRPలు పీ. వెంకట

