Tv424x7
Andhrapradesh

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసుల మృతి

..!టెక్సాస్‌: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్‌ హైవేలో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది..అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది..జాన్సన్‌ కౌంటీలో ఉన్న 67వ నంబరు హైవేపై మినీవ్యాన్‌ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమలాపురం వాసులుగా తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉందన్నది ఇంకా తెలియరాలేదు..ఈ ప్రమాదంపై తానా సభ్యులు ఈనాడు.నెట్‌తో మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని తెలిపారు. అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్‌ సూచన మేరకు తానా ట్రెజరర్‌ అశోక్‌ కొల్లా, ఫౌండేషన్‌ ట్రెజరర్‌ పోలవరపు శ్రీకాంత్‌.. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.

Related posts

వైసీపీకి రాజీనామా చేసిన సినీ నటుడు అలీ

TV4-24X7 News

నంద్యాల రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ

TV4-24X7 News

కాలినడకన తిరుమలకు చేరుకున్న మహేష్ బాబు కుటుంబ సభ్యులు

TV4-24X7 News

Leave a Comment