మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూభూషణ్ అవార్డు.తెలుగు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. భారత ప్రభుత్వo అత్యున్నతమైన రెండవ అవార్డు అయిన పద్మ విభూషణ్ అవార్డును చిరంజీవికి ప్రకటించడం విశేషం. తెలుగు సినీ చరిత్రలో అద్భుతమైన నటుడుగా పేరుపొందిన చిరంజీవికి అవార్డు రావడం పట్ల ఆయన అభిమానుల్లో హర్షం వ్యక్తం అవుతుంది..ఈ అవార్డు మీది.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డు అభిమానులదేనని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. తన 45 ఏళ్ళ సినీ ప్రస్థానంలో తనకు అండగా నిలిచిన అభిమానులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు అవార్డు ప్రకటించినందుకు భారత ప్రభుత్వానికి, భారత ప్రధాని నరేంద్ర మోడీ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

previous post