Tv424x7
Andhrapradesh

అమెరికాలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు

హైదరాబాద్:సెప్టెంబర్ 23ప్రధాని మోదీ అమెరికా పర్యటన వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో ప్రవాస భారతీయుల సదస్సు ఏర్పాటు చేయగా ప్రధాని మోదీ దీనికి హాజర య్యారు. అయితే ఈ ఈవెంట్ లో అనేకమంది ఇండియన్ కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వగా మన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా స్పెషల్ ప్రఫార్మెన్స్ ఇచ్చారు. పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ తో అక్కడి ప్రేక్షకులని అలరించారు.అనంతరం దేవి శ్రీ ప్రసాద్, హనుమాన్‌కైంద్, ఆదిత్య గాధ్వి.. హర్ ఘర్ తిరంగా పాట పాడుతూ ప్రధాని మోదీకి స్టేజిపైకి ఆహ్వానం పలికారు. స్టేజిపైకి వచ్చిన ప్రధాని మోదీ, దేవి శ్రీ ప్రసాద్ ని దగ్గరకు తీసుకొని కౌగలించుకొని అభినం దించి ప్రశంసల వర్షం కురిపించారు.దేవితో పాటు స్టేజిపై ఉన్న మిగిలిన కళాకారులను కూడా దగ్గరకు తీసుకొని మోదీ అభినందించారు. దీంతో ఆ వీడియోలు వైరల్ గా మారాయి. అమెరికాలో ప్రవాస భారతీయుల ఈవెంట్లో స్టేజిపై మన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ని ప్రధాని మోదీ అభినందిం చడం విశేషం.

Related posts

ప్రైవేటు పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని వంశీకృష్ణ కి వినతి పత్రం అందజేస్తున్న చీకటి రమేష్

TV4-24X7 News

ఏపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు

TV4-24X7 News

నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పవన్‌ పర్యటన

TV4-24X7 News

Leave a Comment