ముఖ్యఅతిథిగా పాల్గొన్న కొల్లి సింహాచలం
విశాఖపట్నం జీవీఎంసీ, మెప్మా సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న 34వ వార్డు, భూపేష్ నగర్ లో వున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో గురువారం దీపావళి సంబరాలు సమిష్టి స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. వసతి గృహం లో ఉన్న నిరాశ్రయులకు సొసైటీ అధ్యక్షురాలు కొల్లి సింహాచలం, కేంద్రం కేర్ టేకర్లు బర్రి కోదండరావు, వాసుపల్లి ధనరాజు చేతుల మీదుగా పళ్ళు స్వీట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కోశాధికారి పి. ఏ. రావు, కె. శ్రీను కుమార్ తదితరులు పాల్గొన్నారు.