వైసీపీకి నంద్యాలలో ఎదురుగాలులు నంద్యాల 4 వార్డ్ టిడిపి ఇంచార్జ్ మజీద్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి 4 వార్డ్ కౌన్సిలర్ తబ్రేజ్ నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారి సమక్షంలో టీడీపీలో చేరిక వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఫిరోజ్ ..ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాలలో అన్ని సామాజిక వర్గాల ప్రజలు వైసీపీని వీడే పరిస్థితికి వైసిపి పార్టీ దిగజారిందని , వైసిపి పార్టీ నాయకులని కార్యకర్తలను విస్మరించిందని వారికి తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు . కాబట్టి వారి ఆత్మ అభిమానం చంపుకొని వైసీపీలో పని చేయలేక 4 వార్డ్ కౌన్సిలర్ తబ్రేజ్ టిడిపిలో చేరారన్నారు టిడిపిలో వారికి సూముచిత స్థానం కల్పించి ప్రజలకు మంచి పరిపాలన అందించి నంద్యాలను అభివృద్ధి చేస్తామన్నారు . అదేవిధంగా కౌన్సిలర్ తబ్రేజ్ మరియు 4 వార్డ్ టిడిపి నాయకులు కలిసికట్టుగా పనిచేసే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని రానున్న మున్సిపల్ ఎలక్షన్లో నంద్యాల ని క్లీన్ షిప్ చేయాలని ఎన్ఎండి ఫిరోజ్ తెలియజేశారు . ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు
