అమరావతి :ఏపీ రాష్ట్రంలో మెగా డీఎస్సీకి దరఖాస్తుల గడువుఈనెల 15వ తేదీతో ముగియనుంది. జూన్ 6 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు 3,03,527 అప్లికేషన్లు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి గత నెల 20న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇంకా దరఖాస్తు చేయని వారు
https:// cse.ap.gov.in/, https://apdsc.apcfss.in/
వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చు.

