అమరావతి :ఏపీలో వరుసగా పరీక్షలు వాయిదాపడుతున్నాయి. డిపార్ట్మెంట్ పరీక్షలు కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీస్, డిగ్రీ, టీటీడీ డిగ్రీ కళాశాలలకు సంబంధించిన లెక్చరర్ పోస్టుల పరీక్షలను APPSC వాయిదా వేసింది. ఈ పరీక్షలు జూన్ 16 నుంచి 26వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొంది. పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.
