ఏపీ: చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్పోర్ట్కు తిరుమల శ్రీవారి పేరును పెట్టాలని ప్రతిపాదించినట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి లేఖ రాయనున్నామని వెల్లడించింది. ఇవాళ తిరుమలలో జరిగిన టీటీడీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. బెంగళూరులో శ్రీవారి ఆలయం నిర్మించనున్నట్లు పేర్కొంది. ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

previous post