బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన గాజులవేణి శ్రావణి (గర్భిణి) ఆత్మహత్యాయత్నం చేసి మృతి చెందింది. ఆదివారం రాత్రి ఆమె ఇంట్లో గడ్డి మందు తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ప్రథమ చికిత్స అనంతరం, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా, వైద్యులు శ్రావణిని కాపాడలేకపోయారు.
ఈ ఘటనపై తాళ్ల గురిజాల ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ – శ్రావణి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదని, పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపారు.

